చంద్రబాబు తూర్పు గోదావరి జిల్లా పర్యటన విజయవంతం చేయాలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ పిలుపునిచ్చారు. గోకవరంలో టీడీపీ నాయకుడు పైలా శ్రీనివాస్ నివాసంలో చంద్రబాబు పర్యటనపై శనివారం కార్యకర్తలతో సమీక్షించారు. 15వ తేదీన చంద్రబాబు నాయుడు ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా గోకవరం విచ్చేయనున్నారని తెలిపారు.మధురపూడి విమానాశ్రయానికి 15 వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు చేరుకుంటారన్నారు. అక్కడ నుంచి గోకవరం మండలం గుమ్మళ్ళదొడ్డి మీదుగా గోకవరం చేరుకోవడం జరుగుతుందన్నారు. గోకవరంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి అనంతరం మల్లిశాల మీదుగా జగ్గంపేట చేరుకుని ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించి.. బహిరంగ సభలో ప్రసంగిస్తారన్నారు. రాత్రి జడ్పీ మాజీ చైర్మన్ జ్యోతుల నవీన్ క్యాంప్ కార్యాలయం వద్ద బస చేస్తారన్నారు. 16వ తేదీన కాకినాడ రోడ్లో గల హెచ్పీ పెట్రోల్ బంక్ సమీపంలో ఉన్న ఖాళీ స్థలంలో జగ్గంపేట నియోజకవర్గానికి చెందిన 2650 మంది నాయకులతో చర్చిస్తారన్నారు.అనంతరం పెద్దాపురం నియోజకవర్గ పర్యటనకు వెళతారని తెలిపారు.సమావేశంలో టీడీపీ నాయకులు మంగరాతి రాము, ఉంగరాల రాము, అడపా భరత్, కన్నబాబు, పాలూరి బోస్, బత్తుల సత్తిబాబు, గునుపే భరత్, కోట పెదసూరిబాబు, వల్లేపల్లి సత్యనారాయణ, పురంశెట్టి శివాజీ పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa