ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తల్లి, కూతురు లను గుర్తు తెలియని దుండగులు దారుణహత్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Feb 05, 2023, 02:38 PM

పశ్చిమ గోదావరి జిల్లా, ముసునూరు, కాట్రేనిపాడు శివారు ఎన్టీఆర్‌ నగర్‌లో తల్లి, కూతురు దారుణహత్యకు గురవడం తీవ్ర కలకలం రేపింది. సొంగా ఏసు మరియమ్మ (37)కు తన భర్తతో గొడవల కారణంగా విడాకులు ఇచ్చి 16 ఏళ్ల కుమార్తె అఖిలతో కలిసి ఉంటున్నది. ఆమె కూలి పనులు చేసుకుంటూ జీవిస్తోంది. కుమార్తె పదో తరగతి చదువుతోంది. మరియమ్మ బొమ్ములూరుకు చెందిన దేవరపల్లి రవితో పదేళ్ళ నుంచి సహజీవనం చేస్తోంది. శనివారం రాత్రి ఏడు గంటల సమయంలో సోదరుడు దుక్కిపాటి గురవయ్య పాలు ఇచ్చేందుకు ఆమె ఇంటికి వెళ్ళాడు. గేటుకు తాళం వేసి ఉండటంతో పలుమార్లు అక్కకు ఫోన్‌ చేశాడు. ఆన్సర్‌ చేయకపోవడంతో లోపలకు వెళ్లి చూడగా అక్క, మేనకోడలు ఇద్దరూ మంచంపై విగత జీవుల్లా పడి ఉండటం చూసి కేకలు వేశాడు. చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. నూజివీడు సీఐ ఆర్‌.అంకబాబు, ఎస్‌ఐ ఎం.కుటుంబరావు ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించారు.ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ ఘటనా స్థలాన్ని పరిశీలిం చారు. తల్లి, కూతుళ్ల తలలపై బలమైన ఆయుధంతో గాయపరిచి నట్లు ఉంది. ఈ హత్యలు శుక్రవారం రాత్రే జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa