తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బుధవారం కాకినాడ జిల్లాకు రానున్నారు. ఇదేంఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా మూడు రోజులపాటు తూర్పు, కాకినాడ జిల్లాల్లో ఆయన పర్యటించనున్నారు. బుధవారం సాయంత్రం మూడు గంటలకు మధురపూడి విమానాశ్రయానికి ఆయన చేరుకుంటారు. పార్టీ వర్గాలు అక్కడ ఘన స్వాగతం పలకనున్నాయి. 3.30కు కారులో బయలుదేరి కోరుకొండ మీదు గా గోకవరం మండలం గుమ్మళ్లదొడ్డి చేరతారు. అక్కడ టీడీపీ కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు హారతి ఇచ్చి స్వాగతం పలుకుతారు. 4.35 గంటలకు గోకవరం రోడ్డులో హెహికల్పై వెళతారు. 4.45గంటలకు రోడ్షో ప్రారంభిస్తారు. 5.05 గంటలకు రోడ్డుషో ముగుస్తుంది. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలువేసి నివాళులర్పిస్తారు. అక్కడ కారులోకి మారి కొత్తపల్లి బస్టాండ్ వద్ద కొద్ది నిమిషాలు ఆగుతారు. తర్వాత రాజపూడిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. రాత్రి 7గంటలకు కాకినాడ జిల్లా జగ్గంపేటలో ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరించి, బహిరంగ సభలో మాట్లాడతారు. అక్కడే బస చేస్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa