యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాల భాగంగా నాలుగో రోజు శుక్రవారం స్వామివారు హంసవాహనంపై ఆలయ తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. వజ్రాభరణాలు, రకరకాల పూలతో స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. స్వామివారు హంసవాహనంపై ఆలయ తిరువీధుల్లో ఊరేగుతూ భక్తకోటిలోని అజ్ఞానం తొలగించి జ్ఞానప్రకాశం వెలిగించు తత్వమే హంస రూపంలోని పరమార్థమని అర్చకులు వివరించారు. ఊరేగింపులో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి దివ్య స్వరూపాన్ని దర్శించుకున్నారు.