ఒంగోలు జిల్లాలోని పొగాకు వ్యాపారుల గృహాలు, కంపెనీలలో ఐటీ అధికారులు దాడులు చేయడం కలకలం రేపింది. మంగళవారం ఉదయం ఒంగోలులోని భాగ్యనగర్లో ఉన్న పొగాకు బోర్డు డైరెక్టర్ గుత్తా వాసుబాబు, టంగుటూరు, జమ్మలపాలెంలో గల వారి బంధువుల ఇళ్లలో ఆదాయపన్ను శాఖ అధికారులు ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. విజయవాడ నుంచి బృందాలు వచ్చిన వారు తెల్లవారిన వెంటనే ఒక్కసారిగా ఇళ్లలోకి ప్రవేశించి సోదాలకు ఉపక్రమించారు. టంగుటూరులోని రెండు పొగాకు కంపెనీలు, జమ్ములపాలెంలోని ఓ వ్యాపారి ఇంట్లో తనిఖీలు చేపట్టారు. ఉదయం 7.30 గంటలకు మొదలైన సోదాలు అర్ధరాత్రి వరకూ కొనసాగుతున్నాయి. మంగళవారం ఉదయం 7గంటల ప్రాంతంలో టంగుటూరుకు చేరుకున్న ఐటీ అధికారులు పొగాకు గ్రేడింగ్ కంపెనీలు తెరిచే వరకూ ఎవ్వరికీ అనుమానం రాకుండా వాహనాల్లో అటూఇటూ తిరిగారు. కంపెనీల గేట్లు తెరిచిన వెంటనే ఒక్కసారిగా కార్లలో లోపలికి వెళ్లారు. టంగుటూరులోని రావూరి ప్రవీణ్, గుత్తా వాసుబాబు పొగాకు గ్రేడింగ్ కంపెనీలు, జమ్ములపాలెంలోని ప్రవీణ్ గృహంపై దాడులు చేశారు. వారి వెనుకే వచ్చిన సీఆర్పీఎఫ్ పోలీసులు గేట్లు మూసివేశారు. కంపెనీలు, ఇళ్లలో ఉన్న వారందరి సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. లోపలి వారిని బయటకు, బయట వారిని లోపలికి అనుమతించ లేదు. దాడులు జరిగిన ఒక్కో చోటకు నాలుగు కార్లలో 10మంది వరకు అధికారులు వచ్చారు. కంపెనీలు, ఇళ్లలో ఉన్న బీరువాలు తెరిపించారు. వాటిలో ఉన్న రికార్డులు, ఇతర డాక్యుమెంట్లు, పత్రాలను స్వాఽధీనం చేసుకున్నారు. కంప్యూటర్లు, ల్యాప్టా్పలు, సమాచారం నిక్షిప్తం చేసే ఇతర పరికరాలన్నీ తీసుకున్నారు. ప్రవీణ్ కుటుంబానికి సంబంధించిన యూనియన్ బ్యాంకు లాకర్ను కూడా తెరిపించి పరిశీలించినట్లు సమాచారం. బ్యాంకు లావాదేవీలు కూడా చూసినట్లు తెలిసింది. అర్ధరాత్రి వరకూ తనిఖీలు కొనసాగుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa