వచ్చే ఎన్నికల్లో పొత్తులపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. 151 ఎమ్మెల్యేలకు సీట్లు ఉంటాయని ప్రకటించే దమ్ము జగన్ రెడ్డి కి ఉందా అని ప్రశ్నించారు. టీడీపీతో పొత్తుకు చాలా పార్టీలు ముందుకు వస్తున్నాయని తెలిపారు. జగన్ కు దైర్యం ఉంటే ఉద్యోగుల జీతాలు ఒకటవ తారీఖున ఇవ్వాలన్నారు. వైసీపీకి దమ్ముంటే ఇప్పడు ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. రైతు భరోసా కేంద్రాలు కాదు రైతు దగా కేంద్రలను ఏర్పాటు చేశారని మండిపడ్డారు. మంత్రుల హడావుడి పర్యటన తప్ప రైతులకు ఓరిగిందెమిలేదన్నారు. ఇళ్ల స్థలాల పేరుతో కోట్లు దోచుకున్నారని.. టిడ్కో ఇల్లు ఇంతవరకు ఇవ్వలేదని అన్నారు. పేదవారికి జగన్ ప్రభుత్వం గుదిబండగా తయారైందని వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వంలో పేదవారు బ్రతకలేని పరిస్థితి ఉందని పత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa