తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు చేపట్టిన యువగలం పాదయాత్ర శనివారం రోజు చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో మూడువ రొజు జరుగుతున్న సందర్భంగా రాయచోటి టిడిపి నియోజకవర్గ నాయకుడు రాంప్రసాద్ రెడ్డి టిడిపి కార్యకర్తలు తన అనుచరులతో కలిసి పాదయాత్రలో శనివారం పాల్గొని లోకేష్ బాబు వెంట నడిచారు. అనంతరం యువకులు ఉద్దేశించి జరిగిన మీటింగ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నారా లోకేష్ బాబు చేపట్టిన పాదయాత్రలో ప్రజలు ఆయనకు అడుగడుగునా నీరాజనాలు పడుతూ విశేష స్పందన లభిస్తుంది అన్నారు. ఇది చూసి ఓర్వలేని ప్రభుత్వం పాదయాత్రలకు అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. ఏం జరిగినా కార్యకర్తలు, ప్రజలు అండదండలతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పాదయాత్ర ముందుకు కొనసాగిస్తూ ప్రభుత్వం చేసే అరాచకాలను ఎండగడుతూ రాబోయే కాలంలో టిడిపి జెండాను ఏగరవేస్తామని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa