జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రవేశపెట్టినటువంటి మూడో విడత సభ్యత నమోదు కార్యక్రమంలో భాగంగా గురజాల నియోజవర్గ క్రియాశీలక వాలంటీర్స్ గా పనిచేసినటువంటి జన సైనికులకు పిడుగురాళ్ల మండల పార్టీ ఆఫీసు నందు నియోజవర్గ ఐటీ విభాగం ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఆదివారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజవర్గంలో అత్యధికంగా సభ్యత నమోదు కార్యక్రమం జరగడం చాలా శుభ పరిణామమని అన్నారు. కార్యకర్తల క్షేమం కోసం అధినేత పవన్ కళ్యాణ్ ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమాన్ని నిస్వార్ధంగా ప్రజల్లోకి తీసుకెళ్లి, ఎంతో కృషిచేసి సభ్యత్వ నమోదు చేయించిన క్రియా వాలంటీర్లకు పేరుపేరునా అభినందనలు తెలియజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa