తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు పేరిట తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడలేని విధంగా సత్తెనపల్లి పట్టణంలో నిర్మించిన "తారక రామా సాగర్" ను ప్రముఖ సినీ నటుడు తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు నారా రోహిత్ ఆదివారం సందర్శించి ప్రశంసించారు. డాక్టర్ కోడెల శివప్రసాదరావు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న నారా రోహిత్ ఆదివారం సత్తెనపల్లి పట్టణంలోని డాక్టర్ కోడెల శివప్రసాదరావు శాసనసభపతిగా కొనసాగిన సమయంలో నిర్మించిన, పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఆవిష్కరించిన తారకరామారావు సాగర్ ను యువనేత డాక్టర్ కోడెల శివరాంతో కలిసి వీక్షించారు. ఈ సందర్భంగా నారా రోహిత్ మాట్లాడుతూ.. డాక్టర్ కోడెల శివప్రసాదరావుకి నందమూరి తారకరామారావు అంటే ఎంత అభిమానం ఉందో తారక రామాసాగర్ చూస్తుంటే అర్థమవుతుందని నిర్మాణం చేపట్టిన డాక్టర్ కోడెల శివప్రసాదరావు సత్తెనపల్లి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని నారా రోహిత్ అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa