కట్టెల పొయ్యి మీద అట్టుకల్ పొంగల వండుతూ సుధా మూర్తి కనిపించే ఓ ఫోటో సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది. సుధా మూర్తి.. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. తన దాతృత్వం, ప్రవర్తనతో జనం గుండెల్లో నిలిచారు. ఆమె ఎందరికో రోల్ మోడల్గా ఉన్నారు. ఒక అధ్యాపకురాలిగా, రచయిత్రిగా, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఛైర్పర్సన్గా కొనసాగుతున్నారు. రూ.35 వేల కోట్ల సంపద కలిగిన కుటుంబం నుంచి వచ్చిన సుధామూర్తి ఎంతో నిరాడంభరంగా ఉంటారు. ధనవంతురాలిననే గర్వం ఎక్కడా కనిపించదు. సాదాసీదా ఒక మధ్యతరగతి కుటుంబంలో ఉన్న మహిళలా కనిపిస్తారు ఆమె. ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచారు. కేరళలోని అట్టుకల్ భగవతి దేవి ఉత్సవాల్లో మెరిసారు. ఒక సాధారణ మధ్య తరగతి కుటుంబంలోని మహిళ వలే కట్టెల పొయ్యి మీద అట్టుకల్ పొంగల వండుతూ కనిపించారు. ప్రస్తుతం ఆమె ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
ఒక రచయిత్రిగా అట్టుకల్ పొంగల గురించి రాస్తానని, సందర్భం వచ్చినప్పుడు దాని గురించి తప్పగా ప్రజల్లోకి తీసుకెళ్తానని పేర్కొన్నారు సుధామూర్తి. గత మంగళవారం కేరళ రాజధాని తిరువనంతపురంలో మొదలైన అట్టుకల్ దేవి ఉత్సవాల్లో పాల్గొన్నారు పద్మ శ్రీ అవార్డు గ్రహీత సుధామూర్తి. ఈ సందర్భంగా స్వయంగా కట్టెల పొయ్యిపై అట్టుకల్ పొంగల తయారు చేసి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. ఇది ఒక భిన్నమైన అనుభూతినిచ్చిందన్నారు. ఈ ఉత్సవం నారీ శక్తిని సూచిస్తోందని, చాలా మంది మహిళలు ఎక్కడెక్కడి నుంచో ఇక్కడి వచ్చి అమ్మవారిని కోలుస్తున్నారని పేర్కొన్నారు.
ఈ పొంగల ఉత్సవాలు సమానత్వాన్ని సూచిస్తున్నాయని తెలిపారు. ఇక్కడ కులం, మంత, పేద, ధనిక అనే తేడాలు లేకుండా అందరు కలిసి ఒకరికొకరు సాయం చేసుకుంటూ అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తున్నారని గుర్తు చేశారు. ఇందులో చాలా మంది మరోసారి కలుసుకునే అవకాశం లేదని, అయినప్పటికీ వారు సహకరించుకుంటున్న తీరు ఆకట్టుకుందన్నారు. ఈ సందర్భంగా తన అనుభవాన్ని పంచుకున్నారు సుధామూర్తి. తాను నైవేద్యం తయారు చేస్తుండా అన్నం ఉండికిందా అని పక్కన వారిని అడిగానని, వారు మరికొంత సమయం ఉడికించాలని చెప్పారని గుర్తు చేసుకున్నారు. అక్కడ కొబ్బరి, యాలకులు వంటివి ఒకరికొకరు అందించుకున్నారని, పనులను పంచుకున్నారని చెప్పారు. అలాంటి సమానత్వాన్ని తాను ఇష్టపడతానన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఒక రోజు ముందు ఇక్కడ జరుగుతున్న ఉత్సవాల్లో మహిళలతో కలిసి పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు.
మరోవైపు.. 2019లో కేరళలో వరదలు వచ్చి ప్రజలు ఇబ్బందులు పడినప్పుడు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ద్వారా చేసిన సాయాన్ని గుర్తు చేసుకున్నారు సుధామూర్తి. వరద సాయంపై ముఖ్యమంత్రిని కలిసేందుకు వచ్చినప్పుడే ఈ పొంగల గురించి విన్నానని చెప్పారు. అప్పుడే ఈ కార్యక్రమంలో ఒక్కసారైన పాలుపంచుకోవాలని నిశ్చయించుకున్నానన్నారు. అయితే, ఆ తర్వాత సంవత్సరం కోవిడ్ మహమ్మారి రావడంతో రాలేకపోయానన్నారు. ఈ ఏడాది 2023లో సుధామూర్తితో పాటు ఆమె సెక్రెకటరీ లీనా గోపకుమార్, దేవి పద్మనాభణ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa