కొండ సంపదను తరలిస్తే కఠిన చర్యలు తప్పవని సిద్ధవటం ఫారెస్ట్ రేంజ్ అధికారి ప్రసాద్ అన్నారు. కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం అటవీ క్షేత్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సిద్ధవటం రేంజ్ సిద్ధవటం, రోల్ల బోడు, అటవీ ప్రాంతాలలోమా సిబ్బంది రెండు బృందాలుగా గాలింపు చర్యలు చేపట్టి 26 ఎర్రచందనం, దుంగలను స్వాధీనం చేసుకున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ రేంజర్ ఓబులేసు, ఫారెస్ట్ బీట్ అధికారులు, హైమావతి, విశ్వనాధ్, రాజశేఖర్ రెడ్డి, ప్రొటెక్షన్ వాచర్లు, అటవీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa