ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారానికీ విజయసాయిరెడ్డి దూరంగా ఉన్నారు. అసలు జగన్కు విజయసాయిరెడ్డికి ఇటీవలి కాలంలో సరిగా పడటం లేదన్న టాక్ నడుస్తోంది. సినీ నటుడు తారకరత్న అంత్యక్రియల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబుతో విజయసాయిరెడ్డి చనువుగా ఉండటంపై జగన్ ఆగ్రహంతో ఉన్నట్టు సమాచారం. పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి చంద్రబాబు, లోకేశ్ లకు వ్యతిరేకంగా మాట్లాడాలని విజయసాయిరెడ్డిని జగన్ ఆదేశించినట్లు తెలుస్తోంది. కానీ జగన్ ఆదేశాలను పక్కన పెట్టి విజయసాయిరెడ్డి ఢిల్లీ కి వెళ్లినట్టు సమాచారం. ఈ క్రమంలోనే జగన్ మరింత ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa