ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలుగుదేశం నేత యనమల కీలక వ్యాఖలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 17, 2023, 08:26 PM

ఆంధ్రప్రదేశ్ మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఓట్ల లెక్కింపు జరుగుతుండగా, టీడీపీ రెండో స్థానంలో ఆధిక్యంలో ఉంది. దాంతో టీడీపీ నేతల్లో ఉత్సాహం ఉప్పొంగుతోంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు స్పందించారు. మనీ పవర్, మజిల్ పవర్ ప్రజల ముందు నిలబడలేవని స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉత్తరాంధ్ర ప్రజలు ఓట్లు వేశారని అన్నారు. కోర్టు పరిధిలో ఉన్న రాజధాని అంశంపై మాట్లాడటం సరికాదన్నారు యనమల. విశాఖపట్నం రాజధానిగా ఉండడం ఉత్తర ఆంధ్రా ప్రజలకు ఇష్టం లేదన్నారు. వైసీపీని చూసి విశాఖ ప్రజలు భయపడుతున్నారని వివరించారు.


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa