ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నకరికల్లులో లోడుతో వెళ్తున్న భారీ లారీ బోల్తా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 19, 2023, 11:38 AM

నకరికల్లు పరిధిలోని అద్దంకి- నార్కెట్ పల్లి రాష్ట్ర రహదారిలో శనివారం సాయంత్రం ఈదురు గాలుల ధాటికి భారీ లారీ బోల్తా పడింది. చెన్నై నుండి హైదరాబాద్ కు ఫ్రిజ్ ల లోడుతో వెళ్తున్న లారీ శ్రీరాం పురం వద్ద ఒక్కసారిగా బోల్తా పడటంతో, లారీలో ఉన్న ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. 108 ద్వారా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పడిపోయిన లారీని ప్రొక్లెయిన్ సహాయంతో తొలగించి ట్రాఫిక్ క్రమబద్దకరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa