ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగనన్న గోరుముద్ద ద్వారా మరో పోషకాహారాన్ని విద్యార్థలకు అందిస్తోంది. స్కూల్ పిల్లలకు వారానికి మూడు రోజులు ఉదయం పూట రాగి జావ అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రభుత్వం రాగి జావ కోసం ఏటా మరో రూ.86 కోట్లు కలిపి మొత్తంగా రూ.1,910 కోట్లు వెచ్చిస్తూ పిల్లలకు పౌష్టికాహారం కోసం ఖర్చు చేస్తోంది.
రాగి జావ పథకం ప్రారంభంపై సీఎం జగన్ ట్వీట్ చేశారు. పౌష్టికాహారంతోనే ఆరోగ్యం, చక్కటి విద్యాభ్యాసం సాధ్యమని నమ్ముతున్నామని.. ఒక మేనమామగా మధ్యాహ్న భోజన కార్యక్రమం "గోరుముద్ద”లో భాగంగా ఇవ్వాల్టి నుంచి రాగిజావ అందిస్తున్నామన్నారు. గుడ్డు, చిక్కీ సహా అందిస్తున్న 15 ఆహార పదార్థాలకు ఇది అదనమని.. భాగస్వామి అయిన సత్యసాయి ట్రస్టుకు ధన్యవాదాలు తెలిపారు.
ఇవాళ గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు ముఖ్యమంత్రి. స్కూల్ విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్కూల్లో రుచికరంగా వండిపెడుతున్న అమ్మలకు అభినందనలు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లలో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. గోరుముద్ద కార్యక్రమాన్ని మరింతగా పటిష్టం చేసేందుకు రాగిజావ కూడా పిల్లలకు అందిస్తున్నామన్నారు. పిల్లలకు ఐరన్, కాల్షియం పెరగడానికి ఈ ఆహారం ఎంతగానో ఉపయోగపడుతుంది అన్నారు. 1 నుంచి 10 తరగతి పిల్లలకు దాదాపు 38లక్షల మంది పిల్లలకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నామన్నారు.
గత ప్రభుత్వం.. ఈ ప్రభుత్వం మధ్య తేడాను గమనించాలన్నారు. గతంలో ప్రభుత్వం ఏడాదికి రూ.450 కోట్లు కూడా ఖర్చు చేయలేదని.. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గోరు ముద్దద్వారా ప్రతిష్ట్మాతకంగా మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామన్నారు. తమ ప్రభుత్వం ఏడాదికి రూ.1824 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందన్నారు. పిల్లలకు రోజుకో మెనూతో నాణ్యమైన భోజనం పెడుతున్నామని.. పిల్లలకు మంచి మేనమామలా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు.
మొత్తం 15 రకాల ఆహార పదార్థాలు పిల్లలకు గోరుముద్ద అందిస్తున్నామని.. వారంలో 5 రోజులపాటు ఉడికించిన గుడ్లు ఇస్తున్నామని గుర్తు చేశారు. మూడు రోజులు చిక్కి ఇస్తున్నామని.. మంగళ, గురువారం, శనివారాల్లో రాగి జావ కూడా మెనూలో చేరిందన్నారు. ఈ కార్యక్రమంలో సత్యాసాయి ట్రస్టు భాగస్వాములు కావడం ఆనందంగా ఉందన్నారు. ఇంగ్లీషు మీడియం, సీబీఎస్ఈ సిలబస్, బైలింగువల్ టెక్ట్స్బుక్స్, ఐఎఫ్ఎపీ ప్యానెల్స్.. విద్యార్థులకు ట్యాబులు కూడా పంపిణీ చేశామన్నారు. అమ్మ ఒడి, విద్యాకానుక విద్యాదీవెన, వసతి దీవెన కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. పరీక్షలు రాయబోతున్న పిల్లలందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్పారు సీఎం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa