ఏపీ బలపడాలని యోచిస్తున్న బీజేపీ ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేనట్లేనని.. అది ముగిసిన అధ్యాయమని.. పార్లమెంటు సాక్షిగా మరోసారి స్పష్టం చేసింది. మంగళవారం లోక్సభలో వైసీపి ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, బాలశౌరీ అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ సమాధానం ఇచ్చారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక లోటు భర్తీకి.. 14వ ఆర్థిక సంఘం నిధులు కేటాయించిందని నిత్యానందరాయ్ వివరించారు. దీంతో ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు, ఇతర రాష్ట్రాలకు మధ్య తేడా లేకుండా పోయిందన్నారు. ప్రత్యేక హోదాకు బదులుగా ఏపీకి ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించామని.. ఆ ప్యాకేజీ కింద వేల కోట్ల రూపాయల నిధులు విడుదల చేశామని నిత్యానందరాయ్ వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa