తెలుగుదేశం సీనియర్ నేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర నాలుగు రోజుల పాటు కదిరి అసెంబ్లీ నియోజకవర్గంలో సాగింది. 49వ రోజు (మంగళవారం) యువగళం పాదయాత్ర కదిరి అసెంబ్లీ నియోజకవర్గంలో పూర్తి చేసుకుని పుట్టపర్తి అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించింది.
ఉగాది సందర్భంగా నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర మూడు రోజుల పాటు విరామం ప్రకటించారు. ఈ నెల 22, 23, 24 తేదీల్లో పాదయాత్రకు విరామం ఇచ్చారు. ఈ మూడు రోజులు పుట్టపర్తి నియోజకవర్గంలోని ఓడీసీ మండలం వణుకువారిపల్లి విడి సెంటర్లో లోకేష్ బస చేయనున్నారు. పండుగ కూడా విడిది కేంద్రంలోనే జరుపుకుంటారు. ఈ నెల 25న గోనుకువారిపల్లి నుంచి లోకేష్ పాదయాత్ర ప్రారంభం కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa