వెలిగొండ పూర్తి చేయడం, మార్కాపురం జిల్లాను సాధించడమే తన ప్రధాన లక్ష్యం అని మార్కాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ కందుల నారాయణరెడ్డి అన్నారు. సోమవారం అంబపురం గ్రామం నుంచి రెండోరోజు పాదయాత్ర భారీ జనసందోహం మధ్య ప్రారంభమైంది. అంబపురం గ్రామస్థులు ఆయనకు హారతులు ఇచ్చి గజమాలతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్బంగా కందుల మాట్లాడుతూ వెనుకబడిన పశ్చిమ ప్రాంతమైన మార్కాపురం అభివృద్ధి పథంలో నడవాలంటే వెలిగొండ ప్రాజెక్ట్ తక్షణమే పూర్తి చేసి తాగు, సాగునీరు అందించాలన్నారు. అదేవిదంగా మార్కాపురాన్ని జిల్లా చేయడం వలన అన్నివసతులు సమకురడమే కాకుండా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందన్నారు. ఈ రెండు విషయాల్లో వైసీపీ ప్రభుత్వం మాయమాటలతో ప్రజలను దగా చేస్తోందని విమర్శించారు. వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తి చేయాలంటే రెండువేల కోట్ల రూపాయలు అవసరమని అయితే వైసీపీ ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతూ కంటి తుడుపుగా రూ.100 కోట్లు కేటాయించడం ఏమిటని ప్రశ్నించారు. యర్రగొండపాలెం టీడీపీ ఇన్చార్జ్ ఎరిక్షన్బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోందని రానున్న రోజుల్లో వైసీపీకి ప్రజలే బుద్ది చెబుతారన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే వెలిగొండ పూర్తి చేసి ప్రజలకు, రైతులకు తాగు, సాగునీరు అందిస్తామన్నారు. ప్రాజెక్ట్ పూర్తి అయితే భూములకు ధరలు రావడమే కాకుండా ఉద్యోగాలు, వ్యాపారాలు పెరుగుతా యని, వలసలు నివారించవచ్చన్నారు. చంద్రబాబు ఆధ్వర్యంలో కందుల నారాయణరెడ్డితో కలిసి వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామన్నారు. కార్యక్రమంలో టీడీపీ అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa