కుందుర్పి మండలం కరిగానపల్లి గ్రామానికి చెందిన యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కరిగానపల్లి గ్రామానికి చెందిన ఈరన్న, బొమ్మక్క దంపతుల కుమారుడు నటరాజన్ తెల్లవారుజామున ఇంటిలో ఎవరూ లేరు సమయంలో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకొని మృతి చెందాడన్నారు. ఈరన్న, బొమ్మక్కలకు ముగ్గురు కుమారులు ఉన్నారు. వీరికి ఉన్న 5 ఎకరాల వ్యవసాయ పొలంలో గొల్ల నటరాజ్ వ్యవసాయ వృత్తితో జీవించాడన్నారు. గురువారం ఉదయం తల్లిదండ్రులు ఇంటిని శుభ్రం చేద్దామని రాగానే నటరాజ్ ఇంటి లోపల తలుపులకు గొల్లం వేసి ఆత్మహత్యకు పాల్పడినట్టు అనుమానం కలిగింది. వెంటనే ఇంటికి ఉన్న గాజు కిటికీ తలుపులు పగలగొట్టగా అప్పటికే తమ కుమారుడు నటరాజ్ ఉరివేసుకుని విగత జీవిగా మారడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నూరుగా విలపించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతుడి భౌతికాయాన్ని పోస్టుమార్టం నిమిత్తం కళ్యాణదుర్గం ప్రభుత్వ వైద్యశాలకి తరలించారు. మృతుడు తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ కృష్ణమూర్తి తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa