ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వచ్చే నెల 5న చలో ఢిల్లీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 31, 2023, 12:52 PM

వచ్చే నెల 5న చలో ఢిల్లీ కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని సీపీఎం నాయకులు గఫూర్‌మియా పిలుపునిచ్చారు. కర్నూలు జిల్లా, కోడుమూరు, పట్టణంలో గురువారం ఇంటింటికి తిరిగి కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....  కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన బడ్జెట్‌ పేద ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదన్నారు. బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తుందన్నారు. ఇదేమి అని అడిగిన వాళ్లను జైల్లోకి తోస్తుందన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న కేంద్ర ప్రభుత్వంపై పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఏప్రిల్‌ నెల 5న ఢిల్లీలో జరగబోయే ధర్నాకు ప్రజలు కదలిరావాలని పిలుపునిచ్చారు. కార్య క్రమంలో సీపీఎం నాయకులు వీరన్న, రాముడు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa