ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు రేషన్ పంపిణీ డౌటే!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 01, 2023, 11:54 AM

ఏప్రిల్ 1వ తేదీ శనివారం నుంచి ప్రారంభం కావలసిన రేషను సరకుల పంపిణీ ప్రారంభయ్యే అవకాశాలు కనిపించడంలేదు. ఇప్పటి వరకూ హమాలీలుఆందోళనకు దిగగాతాజాగా ఎండీయూ"మల్టీ డిస్పెన్సరీ" యూనిట్ ఆపరేటర్లు సమ్మెకు దిగారు. దీంతో సరకుల పంపిణీపై సందిగ్ధతనెలకొంది. జిల్లా వ్యాప్తంగా 640 రేషను డిపోలున్నాయి.


ఆయా డిపోల ద్వారా 310 ఎండీయూ ఆపరేటర్లు ఉన్నారు. వీరి 5. 20లక్షల కార్డుదారులకు ఉచితంగా బియ్యం, కిలో రూ. 67చొప్పున కందిపప్పు, కిలో రూ. 16 చొప్పున రెండు కిలోల గోధుమపిండి, 13. 50 చొప్పున అరకిలో పంచదార సరఫరా చేస్తున్నారు.


ప్రతి నెలా 1 నుంచి 20 వరకు తేదీ వరకు సరకుల పంపిణీ జరగాల్సి ఉంది. ఈ తరుణంలో ఎండీయూ ఆపరేటర్లు అనూహ్యంగా శుక్రవారం జిల్లా సంయుక్త కలెక్టర్ కె. ఎస్. విశ్వనాథన్, డీఏసీ సూర్యప్రకాశరావులకు సమ్మె నోటీసులు అందజేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa