ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పల్నాడు జిల్లాలో రోడ్ ప్రమాదం , ఒకరు మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 01, 2023, 01:22 PM

పల్నాడు జిల్లా, ముప్పాళ్ళ మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మాదల దగ్గర అదుపు తప్పి ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలు చాగంటి వారి పాలెంకు చెందిన శాంతకుమారి (30)గా పోలీసులు గుర్తించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa