ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాత పెన్షన్‌ విధానం పునరుద్ధరణ చెయ్యాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 01, 2023, 01:58 PM

 ‘‘నూతన పెన్షన్‌ స్కీమ్‌(ఎన్‌పీఎ్‌స)ను రద్దు చేయటానికి కేంద్ర ప్రభుత్వానికి నవంబరు వరకు సమయం ఇస్తున్నాం. రద్దు చేయకపోతే దేశవ్యాప్త సమ్మె తలపెడతాం. పాత పెన్షన్‌ పునరుద్ధరణకు మద్దతిచ్చే రాజకీయ పార్టీలనే అధికార గద్దెపై కూర్చోపెడ తాం. వచ్చే ఎన్నికల్లో వారికే ఓట్లు వేస్తాం’’ అని ఆలిండియా రైల్వేమెన్‌ ఫెడరేషన్‌(ఏఐఆర్‌ఎఫ్‌) జాతీయ ప్రధాన కార్యదర్శి శివగోపాల్‌ మిశ్రా అన్నారు. ‘నూతన పెన్షన్‌ స్కీమ్‌ రద్దు-పాత పెన్షన్‌ స్కీమ్‌ పునరుద్ధరణ’ అన్న అం శంపై శుక్రవారం విజయవాడ డివిజన్‌ పరిధిలో ఏర్పాటు చేసిన సదస్సుకు ఆయన హాజరయ్యారు. మిశ్రా మాట్లాడుతూ.. ‘‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడికక్కడ సీపీఎస్‌, ఎన్‌పీఎ్‌సల పేరుతో ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత భద్రత లేకుండా చేస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఏకకాలంలో పోరాటాలు సాగించేందుకు రాష్ట్ర ప్రభుత్వ సంఘాలతో కూడా భాగస్వామ్యం దిశగా అడుగులు వేస్తాం. పేర్లు ఏవైనా కొత్త పెన్షన్‌ విధానాన్ని మేం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. పాత పెన్షన్‌ను పునరుద్ధరించే వరకు పోరాటాలు ఆగవు’’ అని వివరించారు. ఏపీజేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఐక్యంగా పోరాటాలు చేయటానికి పడిన అడుగులను స్వాగతించారు. దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్‌ యూనియన్‌ సీహెచ్‌ శంకరరావు, సీఐటీయూ రాష్ట్ర నాయకులు ఉమామహేశ్వరరావు తదితరులు మాట్లాడారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa