ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభుత్వానికి మద్దతు ఇవ్వకుంటే మీ చేతిని మీరే నరుకున్నట్లు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 01, 2023, 01:59 PM

 ‘‘రానున్న ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతే మొదటి బుల్లెట్‌ మహిళలకే తగుల్తుంది’’ అంటూ మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యానించారు. శ్రీకాకుళం మండలం సింగుపురం గ్రామంలో శుక్రవారం జరిగిన ‘ఆసరా’ పంపిణీ కార్యక్రమంలో మహిళలను ఉద్దేశించి ఆయన ఈవ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రభుత్వానికి మద్దతు ఇవ్వకుంటే మీ చేతిని మీరే నరుకున్నవారవుతారు. కొంగున డబ్బుంటేనే మీ వెంట మొగుడు ఉంటాడు’’ అని అన్నారు. ప్రభుత్వం మహిళలకు సహాయం చేయడం కొందరికి ఇష్టం లేదని, వైసీపీ పోవాలని వారు చూస్తున్నారన్నారు. ఏ ఇంటికి డబ్బులిచ్చారంటూ బాధ్యతలేని విమర్శలు చేయడం ప్రతిపక్షాలు మానుకోవాలని సూచించారు. ‘‘చంద్రబాబు మన పథకాలన్నీ వృథా అంటున్నారు. ఇటువంటి వారి మాటలను మీరు విశ్వసించకండి. ఎవరో పోరంబోకులు చెప్పిన మాట మీరు వింటారా? టీడీపీ అధికారంలోకి వస్తే మీకు ఇచ్చిన పథకాలు పోతాయి. చంద్రబాబులా నేను మాట తప్పను’’ అని వ్యాఖ్యానించారు. కొంతమంది మగవాళ్లు బాధ్యతగా ఉండరనీ, ఇంట్లో అవసరాలు పట్టించుకోరనీ, ప్రతిదీ భార్యల మీద నెట్టేసి ఊరుకుంటారన్నారు. అలాంటి వారిని ఉద్దేశించి అన్న వ్యాఖ్యలను వక్రీకరించడం తగదన్నారు. సీఎం జగన్‌ చేస్తున్న మంచి నచ్చని కొంతమంది తప్పుడు ప్రచారాలు చేస్తున్నారనివిమర్శించారు. నిత్యావసరాల ధరలు పెరిగాయని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, పక్కనున్న రాష్ట్రాల్లోని ధరలతో పోల్చితే అసలు నిజం తెలుస్తుందని మంత్రి ధర్మాన అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa