భారత ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన వందేభారత్ ప్రత్యేక రైలు ఈనెల 8వ తేదీ నుంచి ఒంగోలు మీదుగా నడవనుంది. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం తిరుపతి నుంచి సికింద్రాబాద్కు ట్రయల్ రన్ నిర్వహించారు. సాయంత్రం6 గంటలకు రైలు ఒంగోలుకు చేరుకుంది. రైల్వే శాఖ అధికారుల నుంచి అందిన సమాచారం మేరకు.. ఈనెల 8న తిరుపతి నుంచి సికింద్రాబాద్కు సర్వీసు మొదలవుతుంది. తిరుపతిలో మధ్యాహ్నం 3.15కు బయల్దేరే రైలు ఒంగోలు 6.30కు చేరుకుంటుంది. 5 నిమిషాలు ఆగి తర్వాత బయలుదేరి రాత్రి 11.45కు సికింద్రాబాద్ చేరుకుంటుంది. అలాగే ఏప్రిల్ 9న సికింద్రాబాద్లో ఉదయం 6 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 11.09కి ఒంగోలులో ఆగుతుంది. ఆ తర్వాత 2.30కు తిరుపతికి చేరుకోనుంది ఈ మేరకు ఇటు సికింద్రాబాద్, ఇటు తిరుపతి వైపు వెళ్లే ప్రయాణికులకు వందేభారత్ రైలు ఏర్పాటు ఎంతో ఉపయుక్తం కానుంది. కాగా సాధారణంగా ఇతర రైళ్లలో ఒంగోలు నుంచి సికింద్రాబాద్కు ఆరేడు గంటల సమయం పడుతుండగా, వందేభారత్ 4 గంటలలో చేరుకుంటుందని, తిరుపతి వెళ్లేందుకు 3.15 గంటలే పడుతుందని రైల్వే అధికారుల వెల్లడించారు. తిరుపతి, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, మిర్యాలగూడ, సికింద్రాబాద్లలో మాత్రమే ఆగే వందేభారత్ రైలు జిల్లాలోని ప్రయాణికులకు మరింత సౌకర్యం కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa