విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని వామపక్షాల నేతలు పేర్కొన్నారు. ఏఐటీయూసీ, సీఐటీయూ నేతలు శనివారం కడప ఆర్డీవో కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి మనోహర్ మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఉద్యమం 700 రోజులుగా కొనసాగుతున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. కార్పొరేట్ సంక్షేమమే ధ్యేయంగా కేంద్రం వ్యవహరిస్తోందని విమర్శించారు. ఉక్కు పరిశ్రమను కాపాడుకునేందుకు ప్రజలు, కార్మికులు ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీఐటీయూ అధ్యక్షుడు కామనూరు శ్రీనివాసులరెడ్డి, ఏఐటీయూసీ జిల్లా ఉప కార్యదర్శి కేసీ బాదుల్లా, నాయకులు మద్దిలేటి, సుబ్బయ్య, సుబ్రహ్మణ్యం, చంద్రశేఖర్, విజయభాస్కర్, గోపి, కేశ వులు, ఉదయ్, నారాయణ, నాగరాజు, సుబ్బరాయుడు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa