అస్తమానం అనుమానంతో చికాకు తెప్పిస్తుంది అని కోపంతో భార్యని హత మార్చాడు ఓ భర్త. చిత్తూరు కొంగారెడ్డిపల్లె విద్యానగర్లో ఈ సంఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్ళితే.... చిత్తూరు కొంగారెడ్డిపల్లె విద్యానగర్లో డిల్లీబాబు(48), హేమలత(42) దంపతులు తమ ముగ్గురు పిల్లలతో నివాసం ఉంటున్నారు. డిల్లీబాబు ఎస్ఆర్పురం మండలం పుల్లూరులో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎస్జీటీగా పనిచేస్తున్నారు. హేమలత స్థానిక ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. పదేళ్లుగా తన భర్తకు వివాహేతర సంబంధం ఉందంటూ తరచూ గొడవపడేది. దాంతో వారిద్దరి మధ్య మాటల్లేవు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం ఏడు గంటలకు పెద్దకుమారుడు తిరుపతికి, రెండో కుమారుడు ఇంటి నుంచి బయటికి వెళ్లాడు. మూడో కుమారుడు హాల్లో పడుకుని ఉన్నాడు. అప్పటికే కత్తితో సిద్ధంగా ఉన్న ఢిల్లీబాబు మూడో కుమారుడిని బెడ్రూమ్లోకి వెళ్లమని చెప్పి.. ఆ తలుపునకు గడియపెట్టాడు. ఆ తర్వాత స్నానం చేసిన వచ్చిన భార్యపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఆమె మెడ, తలపై తీవ్రగాయాలవడంతో అక్కడికక్కడే మృతి చెందింది. తర్వాత నిందితుడు ఇంటి బయట గడియ పెట్టి పరారయ్యాడు. అలాగే తాను పనిచేస్తున్న పాఠశాల హెచ్ఎంకు ఫోన్ చేసి.. సీఎంసీ ఆస్పత్రికి వెళుతున్నానని, సెలవు కావాలని కోరాడు. మరోవైపు బెడ్రూమ్లో ఉన్న ఉత్తేజ్కు తలుపు తెరుచుకోక పోవడంతో స్నేహితులకు, చుట్టుపక్కల వారికి ఫోన్ చేశాడు. వారొచ్చి ఇంటి ప్రధాన తలుపును తెరవగా రక్తపు మడుగులో హేమలత ఉండటంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఒకటో పట్టణ సీఐ నరసింహరాజు, ఎస్ఐ రమే్షబాబు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. భార్య అనుమానిస్తోందన్న కారణంతోనే చంపేసినట్లు ప్రాథమికంగా పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడిని పట్టుకున్నాక పూర్తి వివరాలు తెలుస్తాయని డీఎస్పీ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa