ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మైలవరం నుండి పోటీ చేస్తా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 03, 2023, 01:30 PM

మైలవరం సీటు నాకు ఇవ్వాలని  టీడీపీ ఉపాధ్యక్షుడు బొమ్మసాని సుబ్బారావు, చంద్రబాబుతో మాట్లాడుతాను అని  అన్నారు. ఆదివారం గొల్లపూడిలో తన నివాసంలో నియోజకవర్గంలో 14 పోలింగ్‌ బూత్‌ల యువత, క్రియాశీలకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పార్టీ ఎవరిని అభ్యర్థిగా పెడితే వారికి పని చేయాలని సూచించారు. టీడీపీ గెలుపు కోసం కృషి చేస్తానని, జిల్లాలోకి నారా లోకేష్‌ యువగళం వచ్చే సమయానికి 4 వేల మంది యువతను సిద్ధం చేస్తానని తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని సమావేశాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని, యువత, బూత్‌ లెవల్‌ క్రియాశీలకులు, తమ పరిసర ప్రాంతాల వారికి టీడీపీ అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకతను తెలపాలన్నారు. షాబాద, జక్కంపూడి ప్రాంతాల్లో టీడీపీ హయాంలో నిర్మించిన 12 వేల ఇళ్లు పాడైపోతున్నాయన్నారు. లబ్ధిదారులకు ఇవ్వకుండా వైసీపీ ప్రభుత్వం కక్షసాధింపు చేస్తుందన్నారు. షేక్‌ ఖాదర్‌ పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa