ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గ్రామీణ విద్యార్థులకు పూర్తిస్థాయిలో రవాణా సౌకర్యం కల్పించాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 04, 2023, 12:30 PM

విజయనగరం జిల్లా సంతకవిటి మండలం నుండి పొందూరు మండల కేంద్రంలో పదవ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు రవాణా సౌకర్యం పూర్తిస్థాయిలో కల్పించాలని విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) కోరారు. ఈ మేరకు ఆయన సోమవారం ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ మేనేజర్ కు ఫోన్లో మాట్లాడారు. సoతకవిటి మండల పరిధిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో పదవ తరగతి విద్య అభ్యసించిన విద్యార్థులు, పదో తరగతి పబ్లిక్ పరీక్షలను శ్రీకాకుళం జిల్లా పరిధిలో గల పొందూరులో ఉన్న పరీక్షా కేంద్రాలకు హాజరవుతున్నారని వివరించారు. వీరందరూ బస్సు సౌకర్యం లేక పరీక్షకు హాజరయ్యేందుకు నానా అగచాట్లు పడుతున్నారన్నారు. ఈ విషయాన్ని గుర్తించి తక్షణం పరీక్ష సమయాల్లో ఆర్టీసీ బస్సును అదే మార్గంలో నడిపేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యార్థులకు పలు ప్రయోజనాలను అందించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక చర్యలు చేపట్టారన్నారు. ఇందులో భాగంగా పదవ తరగతి పరీక్ష హాల్ టికెట్ చూపించే విద్యార్థులకు టిక్కెట్ లేకుండానే ప్రయాణించే సౌకర్యం రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందన్నారు. జిల్లాకు శివారు మండలంగా ఉన్న సంతకవిటి మండల పరిధిలో గల గ్రామాల్లో విద్యార్థులకు పూర్తిస్థాయిలో రవాణా సౌకర్యం కల్పించేలా చూడాలని ఆర్ ఎం ను జడ్పీ చైర్మన్ చిన్న శ్రీను ఆదేశించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa