క్రైస్తవ మతాన్ని స్వీకరించిన దళితులకు ఎస్సీ రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయడం దుర్మార్గమని ఎస్సీ మోర్చా ఆంధ్ర జోనల్ ఇంచార్జ్ కొక్కిలిగడ్డ విజయబాబు అన్నారు. ఈ మేరకు సీఎం జగన్ అసెంబ్లీలో దళిత క్రిస్టియన్లను ఎస్సీలో చేర్చాలి అన్న తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ గోపాలపట్నం తహశీల్ధార్ జయకు మంగళవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇది రాజ్యాంగ రీత్యా మతపరమైన రిజర్వేషన్లు చెల్లదని అంబేద్కర్ ఆలోచనకు వ్యతిరేకమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే తప్ప నిజమైన ఎస్సీలకు ఏమాత్రం ప్రయోజనం చేయకూరదన్నారు. దీన్ని భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఖండిస్తూ ఈ తీర్మానాన్ని రద్దు చేయకపోతే భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలు చేస్తామని భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా హెచ్చరించారు. అనంతరం కార్యాలయం ముందు నినాదాలు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa