ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గౌరు వెంకటరెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ లోకి చేరికలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 04, 2023, 12:51 PM

 వైసీపీ ప్రభుత్వంపై విసుగు చెందిన ఆ పార్టీలోని యువత టీడీపీ వైపు ఆసక్తి చూపుతున్నారని పాణ్యం టీడీపీ ఇన్‌చార్జ్‌ గౌరుచరిత, నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి అన్నారు. బ్రాహ్మణపల్లె నాగిరెడ్డి, ఎన్వీ.రామకృష్ణ ఆధ్వర్యంలో టీడీపీలో చేరేందుకు వచ్చిన యువతకు గౌరు దంపతులు టీడీపీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అన్ని వర్గాలు వైసీపీ ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నాయని అన్నారు. పట్టభద్రులు ఇప్పటికే వైసీపీకి వ్యతిరేకంగా ఓటువేసి తమ కసిని చూపించారని అన్నారు. 2024 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో కర్నూలు మార్కెట్‌ యార్డ్‌ మాజీ చైర్మన్‌ పెరుగు పురుషోత్తంరెడ్డి, ప్రభాకర్‌యాదవ్‌, యస్‌.ఫిరోజ్‌, గంగాధర్‌గౌడు, పవన్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa