మగువల ఆర్థిక ప్రగతికి చిహ్నం వైయస్ఆర్ ఆసరా పథకం అని రెవెన్యూ శాఖామాత్యులు ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళం నగరంలోని స్కూల్ ప్రాంగణాన ఆసరా పథక లబ్ధిదారులతో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు గొంటి వీధి,ఇప్పిలి వీధి,పెద్దరెల్లి వీధి,పుణ్యపు వీధి,రైతు బజార్,సెవెన్ రోడ్ జంక్షన్,డీసీసీబీ కాలనీ,బాకర్ సాహెబ్ పేట,సానా వీధి సచివాలయాల పరిధిలో ఉన్న లబ్ధిదారులంతా విచ్చేశారు. 1535 సంఘాలకు, అందులో ఉన్న 15397 సభ్యులకు రూ.12.08 కోట్ల మేర ఆసరా పథకం కింద డ్వాక్రా రుణాలు చెల్లింపునకు వెచ్చించాం అని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa