బీజేపీది ప్రజా వ్యతిరేక పాలనని సర్వేపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ పూల చంద్రశేఖర్ పేర్కొన్నారు. తోటపల్లిగూడూరు మండలం ఇస్కపాలెంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద బుధవారం కేంద్ర పాలనపై కాంగ్రెస్ నేతలు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... పార్లమెంటులో కాంగ్రెస్ యువనేత రాహుల్గాంధీ, అదానీపై చేసిన విమర్శలకు కక్షపూరితంగా ఆయన్ను దోషిగా కేసుల్లో ఇరికించడం దారుణమన్నారు. ఆయన పేర్కొన్నారు. విలువ కలిగిన కుటుంబం నుంచి వచ్చిన నేతను అవమానించడం బాధాకరమన్నారు. మోదీ విధానాలపై తాము నియోజకవర్గంలో ప్రజా ఉద్యమం చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు దుంపల నాగయ్య, దాసరి అంకయ్య, తూపిలి రాంప్రసాద్, గిరి తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa