విజయవాడ, సూర్య బ్యూరో : సీఐఐ (కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ) యంగ్ ఇండియా అమరావతి చాప్టర్ నూతన అధ్యక్షుడిగా తరుణ్ కాకాని నగరంలో జరిగిన కార్యక్రమంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సంద ర్భంగా నూతన అధ్యక్షుడు తరుణ్ కాకాని మాట్లాడుతూ సీఐఐ వై.ఐ. పరిధి ప్రస్తుతం నాలుగు జిల్లాలకు పెరిగిందని ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలోని కళాశాలల్లో యువతలో నైపుణ్యాలను పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబులు యువతను దేశాభివృద్ధిలో భాగస్వామ్యం చేయడానికి పలు పథకాలు ప్రవేశ పెట్టారని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విద్యావ్యవస్థలో మార్పులు రావాలని ఆకాంక్షించారు. పరిశ్రమలు, సమాజ అవసరాలు, యువత నైపుణ్యాలకు నడుమ సమతుల్యత సాధించాల్సిన అవసరం వుంద న్నారు. ఆటోమేషన్తో భవిష్యత్లో ఉపాధి మార్గాలు మారే అవకాశం వుందని, ఆ దిశగా యువతను సంసిద్ధత చేయాల్సిన అవసరం వుందన్నారు. భవిష్యత్లో పారిశ్రామికంగా అమరావతి ఎంతో అభివృద్ధి చెంది పారిశ్రామిక విప్లవానికి నాంది పలుకుందని అందుకు యువతను ఆ దిశగా తయారు చేయడానికి కృషి చేస్తామన్నారు. యువతను సరైన దిశగా వారికి దశ దిశ నిర్దేశిస్తే అద్భుతాలు చేస్తారని వారిని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడానికి మనమంతా కృషి చేయాలన్నారు. తరుణ్ కాకాని ప్రస్తుతం అమరావతి బోటింగ్ క్లబ్, గ్లోకల్ టెక్నాలజీ సొల్యూషన్స సంస్థలకు సీఈవోగా వ్యవహరిస్తున్నారు. అంతే కాకుండా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్రామాల దత్తత కార్యక్ర మాలు చేపట్టి, బెస్ట స్మార్ట విలేజ్ పార్టనర్గా అవార్డు గెలుచుకున్నారు. ప్రతి వారు తమ స్థాయిలో నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణంలో భాగస్తులై స్వర్ణాంధ్రప్రదేశ్ భవితవ్యానికి, అభివృద్ధి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, విజయవాడ సీపీ గౌతంసవాంగ్, ఆర్ఆర్ స్పోర్ట్స అధినేత గాళ్ళ రాధారాణి, సీఐఐ విజయవాడ జోన్ ఛైర్మన్ పి. వెంకట్రా మిరెడ్డి, సీఐఐ యంగ్ ఇండియా సౌత్ ఇండియా రీజియన్ ఛైర్ పర్సన్ పూనమ్ శ్రీనాథ్షా, సహాధ్యక్షులు నన్నపనేని భాస్కర్ తదితరులు పాల్గొని ఆయనను అభినందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa