వాషింగ్టన్: అమెరికా కాంగ్రెస్లో నేడు హెచ్1బీ, ఎల్1 వీసాలపై ఇటీవల తెచ్చిన బిల్లుకు సవరణలు ప్రవేశపెట్టారు. దీనిని నలుగురు సభ్యుల బృందం ప్రవేశపెట్టింది. ఈ బృందంలో ఇండో అమెరికన్ రో ఖన్నా కూడా సభ్యుడిగా ఉన్నారు. ఈ సవరణలకు కాంగ్రెస్ ఆమోదం తెలిపితే విదేశీ కంపెనీల నుంచి విమర్శలు తగ్గుతాయని భావిస్తున్నారు. కాంగ్రెస్ సభ్యులు బిల్ పాస్క్రెల్, డేవ్ బ్రాట్, రో ఖన్నా, పాల్ గ్రోసర్లు ఈ బిల్లును ప్రవేశపెట్టారు. హెచ్1బీ, ఎల్-1 వీసా సవరణ చట్టానికి సంబంధించి మరో ఆరు బిల్లులు ఇప్పటికే పెండింగ్లో ఉన్నాయి. ఇవన్నీ ఈ చట్టానికి లోపాలను సవరించేందుకు ఉద్దేశించినవే.
అమెరికాలో నాస్కామ్ బృందం పర్యటన ముగించుకొని వచ్చిన మర్నాడే ఈ సవరణ రావడం గమనార్హం. ఈ పర్యటనలో నాస్కామ్ పలువురు చట్టసభ ప్రతినిధులను కలిసి హెచ్1బీ, ఎల్1 వీసాల ఉపయోగాలను వెల్లడించారు. ఇప్పటి వరకు అమెరికా నుంచి వచ్చిన ఉద్యోగాల్లో ఎక్కువ భారతీయులే లబ్ధిపొందినట్లు ఎక్కువ మంది రాజకీయ నాయకులు నమ్ముతున్నారు.
ది హెచ్1బీ, ఎల్1 వీసాల సవరణ చట్టం 2017కు అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ లేబర్, కాంగ్రెస్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీర్స్ ఆమోదముద్రవేశాయి. ఈ బిల్లును గ్రాస్లీ, డిక్ డర్బిన్ ప్రవేశపెట్టిన విషయం విదితమే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa