ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జులై 1 నుంచి జీఎస్టీ అమలు: అరుణ్‌జైట్లీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 04, 2017, 05:13 PM

ఢిల్లీ: జులై 1వ తేదీ నుంచి జీఎస్టీ అమలు చేసేందుకు అవకాశం ఉన్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ తెలిపారు. స్వల్ప మార్పులతో సీజీఎస్‌టీ, ఐజీఎస్‌టీ బిల్లులను జీఎస్‌టీ కౌన్సిల్ ఈవాళ ఆమోదించింది. నేటి జీఎస్టీ కౌన్సిల్ సమావేశ వివరాలను అరుణ్‌జైట్లీ మీడియా ద్వారా వెల్లడించారు. సీజీఎస్‌టీ, ఐజీఎస్‌టీ బిల్లులను అన్ని రాష్ర్టాలు ఏకగ్రీవంగా ఆమోదించాయన్నారు. మిగిలిన విషయాలపై చర్చించేందుకు ఈ నెల 16న మరోసారి భేటీ కావాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. జులై 1 నుంచి జీఎస్టీ అమలుకు అవకాశం ఉందన్నారు. రాష్ర్టాల జీఎస్టీ బిల్లుకు న్యాయకమిటీ 3 రోజుల్లో తుదిరూపు ఇస్తుందని అనంతరం బిల్లును రాష్ర్టాలకు పంపిస్తామన్నారు. రాష్ర్టాల జీఎస్టీ బిల్లులను అసెంబ్లీలు ఆమోదించాల్సి ఉందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa