ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పేదరిక నిర్మూలన జగనన్న లక్ష్యం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 07, 2023, 01:11 PM

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళా పక్షపాతని, పేదరిక నిర్మూలనతోపాటు మహిళాభివృద్ధి కే పెద్దపీట వేస్తున్నారని నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి పేర్కొన్నారు. శుక్రవారం ఆమె రెండవ జోన్ మధురవాడ పరిధిలోని 5, వార్డుల పరిధిలోని స్వయం సహాయక సంఘాల గ్రూపులకు మూడవ విడత వైయస్సార్ ఆసరా వారోత్సవాల సందర్భంగా భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు అవంతి శ్రీనివాసరావు తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.


ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ మహిళలను ఆర్థికంగా పైకి తీసుకురావడం కొరకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎనలేని కృషి చేస్తున్నారని, ప్రభుత్వం ఏర్పడే నాటికి 78. 94 లక్షల ఎస్ హెచ్ జి సభ్యులకు రూ. 26, 680 కోట్ల రూపాయలు అప్పు ఉండేది అన్నారు. ప్రభుత్వం ఎప్పటి వరకు మూడు విడతలగా రూ. 19, 260 కోట్ల రూపాయలు విడుదల చేసిందన్నారు. ప్రస్తుతం రెండవ జోన్ పరిధిలోని 1382 స్వయం సహాయ సంఘాల లోని 13, 935 మంది లబ్ధిదారులకు 3వ విడత కింద 10. 62 కోట్ల రూపాయలు విడుదల చేసిందని తెలిపారు. జగనన్న ప్రభుత్వం గొప్పలు చెప్పుకునే ప్రభుత్వం కాదని ప్రతి పేదవానికి సంక్షేమ పథకాలు అందాలని ఉద్దేశంతో సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టి మంచి పాలన అందిస్తుందన్నారు. స్వయం సహాయక సంఘాల బలోపతానికి, సంఘాలను మరింత అభివృద్ధి పరిచేందుకు నవరత్నాలలో భాగంగా వైయస్సార్ ఆసరా పథకాన్ని ప్రవేశపెట్టి వారికి చేయూతనివ్వడం జరుగుతుందన్నారు. ఇటువంటి మంచి పాలన అందిస్తున్న మన జగనన్న పై ప్రతిపక్షాలు ఎన్నో కుట్రలు చేస్తున్నాయని వాటన్నింటినీ తిప్పకొట్టవలసిన బాధ్యత మహిళలగా మనకే ఉందన్నారు. నాటి జన్మభూమి కమిటీ, నేడు సచివాలయం వ్యవస్థకు వ్యత్యాసం గమనించాలని అందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జగనన్నే మా భవిష్యత్తు అనే మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని మా నమ్మకం నువ్వే జగనన్న అంటూ ప్రజలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నగరాల కార్పొరేషన్ చైర్మన్ పిల్లి సుజాత, కార్పొరేటర్ లోడగల అప్పారావు, మాజీ కార్పొరేటర్ పోతిన హనుమంతరావు, జోనల్ కమిషనర్ కనకమహాలక్ష్మి, వివిధ వార్డ్ అధ్యక్షులు, వైయస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, పెద్ద ఎత్తున మహిళలు తదితరులు పాల్గొన్నారు.


అనంతరం మా నమ్మకం నువ్వే జగనన్న అనే కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు అవంతి శ్రీనివాసరావుతో కలిసి పాల్గొని లబ్ధిదారులకు అందుతున్న జగనన్న సంక్షేమ పథకాలు వివరిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మరోపక్క అభివృద్ధితోపాటు, సంక్షేమ పథకాలు అమలు చేస్తు పేద ప్రజలును ఆదుకుంటున్నారని ఇటువంటి సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారని, నేరుగా లబ్ధిదారు ఖాతాలో జమయ్యే విధంగా వినూత్నమైన కార్యక్రమాలు చేపట్టారని ఎక్కడ కూడా అవినీతికి ఆస్కారం లేకుండా పాలన సాగిస్తున్నారని ఇటువంటి ముఖ్యమంత్రిని మళ్లీ గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తద్వారా జగనన్నే మా భవిష్యత్తు అని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa