తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు సంఘీభావంగా గిద్దలూరు టీడీపీ ఇంచార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి ఉమ్మడి ప్రకాశం జిల్లా టీడీపీ నేతలతో కలిసి ఆదివారం ఉదయం అనంతపురం జిల్లాలోని సింగనమల నియోజకవర్గంలో 65వ రోజు జరుగుతున్న పాదయాత్రలో పాల్గోని నారా లోకేష్ ని కలిశారు. ఈ సందర్బంగా గిద్దలూరు నియోజకవర్గంలోని పలు అంశాల పై చర్చించారు. ఈ పాదయాత్రలో ప్రకాశం జిల్లా టీడీపీ నేతలు రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఒంగోలు మాజీ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్, పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివారావు, కొండేపి శాసనసభ్యులు డోలా బాలవీరాంజనేయ స్వామి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్య, కనిగిరి టీడీపీ ఇంచార్జ్ ముక్కు ఉగ్ర నరసింహా రెడ్డి, యర్రగొండపాలెం టీడీపీ ఇంచార్జ్ గూడూరి ఏరీక్షన్ బాబు, చీరాల టీడీపీ ఇంచార్జ్ ఎం. ఎం కొండయ్య, సంతనూతలపాడు టీడీపీ ఇంచార్జ్ బి. ఎన్ విజయ్ కుమార్, కందుకూరు టీడీపీ ఇంచార్జ్ ఇంటూరి నాగేశ్వరావు, రాష్ట్ర కార్యదర్శి ఇంటూరి రాజేష్ తదితరులు పాల్గోన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa