ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈనెల 13కి వాయిదా పడిన కోడికత్తి కేసు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 11, 2023, 01:21 PM

సీఎం జగన్‌  కోడికత్తి కేసు కొత్త మలుపు తీసుకుంది. ఈ కేసు ట్రయల్‌కు కొత్త షెడ్యూల్‌ ఇస్తామని న్యాయమూర్తి ప్రకటించారు. వాస్తవానికి ఈ కేసులో జగన్‌ విచారణకు హాజరు కావాల్సిందేనని విజయవాడ ఎన్‌ఐఏ న్యాయస్థానం కొద్దిరోజుల క్రితం సమన్లు జారీచేసింది. సోమవారం విచారణకు ఆయన హాజరుకావాల్సి ఉంది. విచారణకు జగన్‌ పీఏ కె. నాగేశ్వరరావు హాజరయ్యారు. అయితే, వైసీపీ లీగల్‌ సెల్‌ ప్రతినిధి, న్యాయవాది ఇంకొల్లు వెంకటేశ్వర్లు సోమవారం జగన్‌ తరఫున రెండు పిటిషన్లను దాఖలు చేశారు. ఈ కేసులో దర్యాప్తును మరింత సమగ్రంగా చేయాలని, జగన్‌కు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని తన పిటిషన్లలో కోరారు. ఈపిటిషన్లపై వాదనల సందర్భంగా.. ట్రయల్‌కు త్వరలో కొత్త షెడ్యూల్‌ ఇస్తానని న్యాయమూర్తి శ్రీనివాస ఆంజనేయమూర్తి తెలిపారు. వీటిపై విచారణను ఈనెల 13వ తేదీకి వాయిదా వేశారు. కాగా, నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావు (శీను) తరపున న్యాయవాది సలీం అదేరోజు ఈ పిటిషన్లపై కౌంటర్‌ దాఖలు చేస్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa