ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపు కృష్ణా జిల్లాలో పర్యటించనున్న చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 11, 2023, 01:26 PM

టీడీపీ జాతీయ అధ్య క్షుడు నారా చంద్రబాబునాయుడు కృష్ణా జిల్లా పర్యటన నేపథ్యంలో , ఈ కార్యక్రమాన్ని  విజయవంతం చేయాలని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సోమవారం అవనిగడ్డలో జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు, మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌లతో కలిసి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.... రాష్ట్రంలో అరాచక పాలన రాజ్యమేలుతోందని, అన్ని వర్గాల ప్రజలు జగన్మోహన్‌రెడ్డి పాలనతో విసిగిపోయారన్నారు. ప్రజలు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా టీడీపీకి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. 12వ తేదీన జరిగే చంద్రబాబు నాయుడు సభ ద్వారా జిల్లాలో తెలుగుదేశం పార్టీ పటిష్టత ను, ఐక్యతను రుజువు చేయాలని కొల్లు రవీంద్ర సూచించారు. మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ జగన్మోహన్‌రెడ్డి అధిక ధరలు, విద్యుత్‌ ఛార్జీలు, కరెంట్‌ ఛార్జీలతో ప్రజలపైన మోయలేని భారం మోపారన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa