కర్నూలు జిల్లా తుగ్గలి మండలం రాతనకొత్తూరులో వైసీపీ నాయకులూ ‘మా నమ్మకం నువ్వే జగన్’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి స్టిక్కర్లు అంటిస్తుండగా గ్రామంలోని కోటేశ్వరరావుతోపాటు వైసీపీ కార్యకర్తలు వారిని అడ్డుకున్నారు. ‘గ్రామంలో ఏం పనులు చేశారని ఇక్కడ అడుగు పెట్టారు?’ అంటూ వాగ్వాదానికి దిగా రు. ‘నాలుగేళ్లయినా గ్రామంలో ఒక్క సీసీ రోడ్డు కూడా వేయలేదు. గ్రామానికి తారురోడ్డు వేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చారే తప్ప ఇప్పటి వరకు వేయలేదు. అర్హత ఉన్నా అనేకమందికి వృద్ధాప్య, వితంతు పింఛన్లు ఇవ్వడం లేదు. ఒక్క హౌసింగ్ బిల్లు కూడా మంజూరు చేయకపోవడంతో ఇల్లు కారుతున్నా అలాగే నివసిస్తున్నాం. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని పలుసార్లు ఎమ్మెల్యే శ్రీదేవి, స్థానిక నాయకులు, వలంటీర్ల దృష్టికి తీసుకెళ్లినా ఒక్క సమస్య కూడా పరిష్కరించలేదు. ఈ రెడ్ల పాలనలో బీసీలను అణగదొక్కుతున్నారు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa