Phil Salt గాయంపై Royal Challengers Bengaluru యాజమాన్యం కీలక అప్డేట్ ఇచ్చింది. ఏప్రిల్ 27న Arun Jaitley Stadiumలో Delhi Capitalsతో జరగనున్న మ్యాచ్కు సాల్ట్ అందుబాటులో ఉండడంలేదని జట్టు మార్గదర్శకుడు Dinesh Karthik స్పష్టం చేశాడు.గత సీజన్ నుంచి జట్టుకు కీలక ఆటగాడిగా ఉన్న సాల్ట్ ఇంకా గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదని తెలుస్తోంది. అతని భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తొందరపడి మైదానంలోకి దింపకుండా జట్టు జాగ్రత్తగా వ్యవహరిస్తోంది.మరోవైపు జట్టు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నప్పటికీ, సాల్ట్ వారితో ప్రయాణించలేదు. బెంగళూరులోనే ఉండి చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం. ఇదే సమయంలో సీనియర్ ఆటగాడు Virat Kohli కూడా జట్టుతో కలిసి ప్రయాణించకపోవడం చర్చనీయాంశమైంది. అయితే కోహ్లీ మ్యాచ్కు ముందు జట్టుతో చేరే అవకాశముందని సమాచారం.ఓపెనింగ్లో సాల్ట్ లేని లోటు ఆర్సీబీకి గట్టిగా అనిపించనుంది. ఈ సీజన్లో అతడు 6 ఇన్నింగ్స్ల్లో 202 పరుగులు చేసి, వేగవంతమైన ఆరంభాలు అందించాడు. గత మ్యాచ్లో అతని స్థానంలో వచ్చిన జాకబ్ బెథెల్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. దీంతో పవర్ప్లేలో జట్టు దూకుడు తగ్గే అవకాశముంది.ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మంచి స్థితిలో ఉన్న ఆర్సీబీ, ఈ మ్యాచ్ను గెలిచి అగ్రస్థానానికి చేరువ కావాలని చూస్తోంది. గతంలో ఢిల్లీ చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలనే లక్ష్యంతో కెప్టెన్ Rajat Patidar సేన బరిలోకి దిగుతోంది.సాల్ట్ గైర్హాజరు జట్టుకు మైనస్ అయినప్పటికీ, మిగిలిన ఆటగాళ్లపై బాధ్యత మరింత పెరిగింది. ఢిల్లీ వంటి బలమైన జట్టును వారి సొంత మైదానంలో ఓడించాలంటే బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలు రెండూ సమష్టిగా రాణించాల్సిందే. ఈ మ్యాచ్లో సాల్ట్ స్థానంలో వచ్చే ఆటగాడు ఎలా ప్రదర్శిస్తాడన్నదే ఆర్సీబీ విజయాన్ని నిర్ణయించగల కీలక అంశంగా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa