భారతదేశంలో గత వారం రోజులుగా బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. దీంతో ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్లలో మార్పులు కనిపిస్తున్నాయి. ఏప్రిల్ 19 నుంచి 25 వరకు ధరలు ఎలా మారాయో ఒకసారి పరిశీలిద్దాం.హైదరాబాద్, విజయవాడ నగరాల్లో ఏప్రిల్ 19న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,55,780గా ఉండగా, ఏప్రిల్ 25 నాటికి అది రూ.1,54,040కు తగ్గింది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,42,800 నుంచి రూ.1,41,200కు పడిపోయింది.దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఇదే ట్రెండ్ కనిపించింది. 24 క్యారెట్ల బంగారం ధర వారం రోజుల్లో రూ.1,55,930 నుంచి రూ.1,54,190కు తగ్గగా, 22 క్యారెట్ల ధర రూ.1,42,950 నుంచి రూ.1,41,350కు దిగివచ్చింది.చెన్నైలో కూడా బంగారం ధరలు తగ్గాయి. ఏప్రిల్ 19న రూ.1,56,660గా ఉన్న 24 క్యారెట్ల బంగారం, ఏప్రిల్ 25 నాటికి రూ.1,54,910కు చేరింది. అదే విధంగా 22 క్యారెట్ల ధర రూ.1,43,600 నుంచి రూ.1,42,000కు పడిపోయింది. ఈ గణాంకాలు చూస్తే వారం రోజుల్లో గోల్డ్ రేట్లు ఎలా క్రమంగా తగ్గాయో స్పష్టమవుతోంది.వెండి ధరలు కూడా ఇదే దిశలో కదిలాయి. ఏప్రిల్ 19న సుమారు రూ.2.80 లక్షలుగా ఉన్న కిలో వెండి ధర, ఏప్రిల్ 25 నాటికి రూ.2.70 లక్షలకు తగ్గింది. దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే ఢిల్లీలో వెండి ధరలు కొంత తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa