ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆమ్ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 11, 2023, 04:42 PM

ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జ్యోతిరావు పూలే జయంతిని నిర్వహించడం జరిగిందని జిల్లా ప్రధాన కార్యదర్శి జీ. కృష్ణ మూర్తి తెలిపారు. మంగళవారం మదనపల్లి పట్టణం అమ్మచెరువు మిట్ట వద్ద జరిగిన కార్యక్రమంలో మహాత్మా జ్యోతిరావు పూలే 196వ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి, సంఘసంస్కర్త జ్యోతిరావు పూలే అని కొనియాడారు.

ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయ హోదా రావడంపై అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి జి కృష్ణమూర్తి మరియు జిల్లా కమిటీ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. పార్టీని స్థాపించిన పది సంవత్సరాలలోనే జాతీయ హోదా రావడం ఎంతో గొప్ప పరిణామం అన్నారు. ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీను అందరిస్తూ ఓట్లు వేసి, జాతీయస్థాయిలో నిలిపినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అరవింద్ కేజ్రీవాల్ పరిపాలన ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని, పేద బడుగు బలహీనవర్గాలకి విద్య, ఆరోగ్యం, ఉచితవిద్యుత్, మహిళా రక్షణ చట్టం పట్ల ప్రజలు స్వాగతిస్తున్నారని దీనిపై భారతదేశ ప్రజానికానికి ధన్యవాదములు చెప్పారు. ఈ కార్యక్రమంలో టి. మల్లికార్జున, ఆకుల రమేష్, సిద్దయ్య, ప్రశాంత్, హేమంత్, రమణయ్య, కృష్ణ పూజిత, పద్మావతమ్మ, తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa