ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మండుతున్న ఏపీలోని పలు జిల్లాలు... తొలిలోనే రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రతలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 11, 2023, 10:09 PM

తొలిదశలోనే  ఏపీలో ఎండలు పతాక స్థాయికి చేరుతున్నాయి.  రానున్న నాలుగైదు రోజుల్లో ఉష్ణోగ్రతలు 3 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ మేర పెరుగుతాయని వాతావరణ నివేదికలు వెల్లడించడం తెలిసిందే. అందుకు అనుగుణంగానే ఏపీలో ఎండ వేడిమి తీవ్రస్థాయిలో కొనసాగుతోంది. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గరిష్ఠస్థాయిలో నమోదవుతున్నాయి. రాష్ట్రంలో సగటు ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు చేరింది. అత్యధికంగా విజయనగరం జిల్లా గుర్లలో 41.83 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నంద్యాలలోని ఆత్మకూరులో 41.7 డిగ్రీలు, ఏలూరు జిల్లా పూళ్ల వద్ద 41.11, బాపట్లలో 41,6, ప్రకాశం జిల్లా గోస్పాడులో 41.8, జంగారెడ్డిగూడెంలో 41.65, అనకాపల్లిలో 41.62, నెల్లూరులో 41.4, నంద్యాలలో 41.2, శ్రీ సత్యసాయి జిల్లాలో 41.29, అనంతపురంలో 41.03, మన్యం జిల్లా భామినిలో 40.93, విజయవాడలో 38.1, తిరుపతిలో 40.7, కడపలో 40.7, తూర్పు గోదావరి జిల్లా కోరుకొండలో 40.61 డిగ్రీలు నమోదయ్యాయి.


ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలో 40.6, అల్లూరి జిల్లా కూనవరంలో 40.31, కృష్ణా జిల్లా తోట్లవల్లూరులో 40.01, ఒంగోలులో 39.8, గుంటూరు జిల్లా దుగ్గిరాలలో 39.7, విశాఖలో 39.3, పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో 39.24, శ్రీకాకుళంలో 37.7, కాకినాడలో 37.2, కర్నూలులో 38.74, రాయచోటిలో 38.12 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa