అందరూ కలిసి మద్యం తాగారు అయితే వారి మధ్య మాటామాటా పెరిగింది. ఘర్షణకు దారితీసింది. ఈ సంఘటనలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఎంవీపీ పోలీసు స్టేషన్ పరిధిలో మంగళవారం ఘటన చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మంగళవారం మధ్యాహ్నం అప్పుఘర్క చెందిన ఐదుగురు మిత్రులు మద్యం తాగడానికి అప్పుఘర్ వద్ద గల ఓబార్కు వెళ్లారు. సుమారు 4 గంటల సమయంలో వీరిమధ్య మాటామాటా పెరిగి గొడవకు దారితీసింది. వీరిలోవాసుపల్లి చిన్నా బీర్ బాటిల్తో వవన్ మీద దాడిచేశాడు. తేరుకున్న పవన్ సోమరాజుతో కలిసి పక్కనే ఉన్న ఇనుప రాడుతో చిన్నాపై దాడిచేశాడు. గాయాలపాలైన చిన్నాను 108లో కేజీ హెచు తరలించారు. సి. ఐ మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో ఎస్. ఐ శ్రీను, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. పవన్, సోమరాజులతో పాటు చిన్నాపై కేసులు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. చిన్నా ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని పోలీసులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa