ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓటు వెయ్యడమే కాదు... ప్రశ్నించడం కూడా వచ్చు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 13, 2023, 04:58 PM

గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావును ఓ వ్యక్తి నిలదీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొడవటికల్లిలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యేను పలు అంశాలపై ఓ వ్యక్తి నిలదీశారు. ముఖ్యంగా ఏపీ రాజధానిపై ఎమ్మెల్యేను ప్రశ్నించారు. మన రాజధాని ఏది అని ఎమ్మెల్యేను సదరు వ్యక్తి అడుగగా.. మన రాజధాని మూడు కదా అని ఎమ్మెల్యే సమాధానం ఇచ్చారు. ‘‘మీకు తెలీదా అని అడిగిన ఎమ్మెల్యే?.. నాకు తెలియదు అన్న వ్యక్తి.. తెలియకపోతే వదిలేసేయండి’’ అని జగన్మోహన్‌రావు అన్నారు. అయితే సుబాబుల్ మద్దతు ధర కల్పిస్తామని పాదయాత్ర చేశారు కదా ఏమైందని సదరు వ్యక్తి ప్రశ్నించారు. ‘‘మీరు ఓటు వేశారా అని ఎమ్మెల్యే అడగ్గా... వేయకపోతే మా దగ్గరికి ఎందుకు వచ్చావు’’ అని ఆ వ్యక్తి ఎదురు ప్రశ్నించారు. దీంతో చేసేదేమీ లేక ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావు అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్లిపోయారు. ఎమ్మెల్యే జగన్ మోహన్ రావు, వ్యక్తి మధ్య జరిగిన సంభాషణ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa