ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నన్ను కాపాడండి సీఎం గారు, కార్యకర్త ఆవేదన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 14, 2023, 01:41 PM

పల్నాడు జిల్లా, పెదకూరపాడు నియోజకవర్గం వైసీపీ కార్యకర్త గోపీనాథ్ తీవ్ర మనస్తాపం చెందుతూ ఓ వీడియో విడుదల చేశారు. తాను 2017 నుంచి ఇప్పటి వరకు పల్నాడు జిల్లా, పెదకూరపాడు నియోజకవర్గంలో జరుగుతున్న ప్రతి వైసీపీ కార్యక్రమంలో పాల్గొంటున్నానని, 2019 జనవరిలో ఎమ్మెల్యే నంబూరి శంకరరావు  టిక్కెట్ విషయంలో జరిగిన ఘర్షణలో తనపై 307 అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారని.. తదనంతరం ఎన్నికల్లో నంబూరి శంకరరావు కోసం పనిచేశానని చెప్పారు. అయినా ఎమ్మెల్యే తనపై కక్ష పెంచుకుని, అక్రమ కేసులు బనాయించి.. రౌడీ షీటు ఓపెన్ చేయాలని పోలీసులపై తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు రెండురోజులుగా తన ఇంట్లో తనిఖీలు చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం స్పందించి తనని కాపాడాలని వీడియో లో తెలియజేసారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa