జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా నాగబాబు నియమితులయ్యారు. ఈ మేరకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉత్తర్వులు జారీ చేశారు. జనసేన పార్టీ ఎన్నారై విభాగం కార్యకలాపాలను కూడా నాగబాబు పర్యవేక్షించనున్నారు. ఇతర దేశాల్లోని జనసేన శ్రేణులను సమన్వయం చేయడంతోపాటు ఎన్నారైల సేవలను పార్టీ కోసం వినియోగించుకునే బాధ్యతలను కూడా నాగబాబుకు అప్పగించారు. అలాగే వేములపాటి అజయ్ కుమార్కు జనసేన పార్టీ అధికార ప్రతినిధి (జాతీయ మీడియా) పదవిని కట్టబెట్టారు. అంతేకాదు, జనసేన పార్టీకి రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించడం, జనసేన పార్టీ అంతర్గత క్రమశిక్షణా వ్యవహారాలను పర్యవేక్షించడం, బూత్ స్థాయి పర్యవేక్షణ బాధ్యతలను కూడా అజయ్కు అప్పగించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa