ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మే 28 న ఘనంగా ఎన్టీ రామారావు శతజయంతి ఉత్సవాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 15, 2023, 12:24 PM

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు శత జయంతిని పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా 100 చోట్ల సభలు, సమావేశాలు నిర్వహించాలని టీడీపీ నిర్ణయించింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. ఎన్టీఆర్‌ జయంతి అయిన మే 28 లోపు వీటిని జరుపుతారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్‌సభ స్థానాల పరిధిలో ఒకో చోట ఒకో సభ నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా మరో 10 చోట్ల ఇవి జరుగుతాయి. అంతర్జాతీయంగా తెలుగువారు నివసిస్తున్న దేశాల్లో 47 చోట్ల వీటిని జరపాలని తలపెట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa